న్యూఢిల్లీ: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నది. కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి దాడులు నిర్వహిస్తున్నది. ఎన్ఐఏ, ఈడీ అధికారులు సంయుక్తంగా ఏకకాలంలో 40కిపైగా ప్రాంతాల్లో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో వివిధ నేరాలతో సంబంధాలున్న 100 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడంతోపాటు శిక్షణ శిబిరాలు నిర్వహణ, ప్రజలను ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 200 మందికిపైగా ఎన్ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాలు, పలువురు కార్యకర్తల ఇండ్లలో సోదాలు జరుపుతున్నారు.
NIA sealed the Telangana PFI head office in Chandrayangutta, Hyderabad in connection with a case registered earlier by NIA. NIA, ED, Paramilitary along with local police sealed the PFI office. pic.twitter.com/yQzVyJWfDy
— ANI (@ANI) September 22, 2022
రెండురోజుల క్రితం నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో దాడులు నిర్వహించిన ఎన్ఐఏ తాజాగా హైదరాబాద్, కరీంనగర్లో సోదాలు చేపట్టింది. హైదరాబాద్లోని చాంద్రాయణగుట్టలోని పీఎఫ్ఐ కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి సోదాలు నిర్వహించిన అధికారులు హార్డ్ డిస్క్, పెన్డ్రైవ్, కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణకు హాజరుకావాలని నిర్వాహకులకు నోటీసులు జారీచేశారు. దీంతోపాటు ఎల్బీనగర్, ఆటోనగర్లోని ఓ ఇంట్లో దాడులు చేసినట్లు తెలుస్తున్నది. ఇక ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, నెల్లూరు, కర్నూలులోని ఓల్డ్ సిటీ కడకపురలో సోదాలు నిర్వహిస్తున్నారు.
Tamil Nadu | NIA searches PFI office bearer houses at several places in Tamil Nadu including Coimbatore, Cuddalore, Ramnad, Dindugal, Theni and Thenkasi. Searches also being conducted at the Chennai PFI State Head office at Purasawakkam. https://t.co/ofDeGm4PLH
— ANI (@ANI) September 22, 2022
కేరళలోని మళప్పురం జిల్లా మంజేరిలోని పీఎఫ్ఐ పార్టీ చైర్మన్ ఒమా సలాం ఇంటితోపాటు ఆ సంస్థ కార్యాలయాలు, నాయకుల ఇండ్లపై అర్ధరాత్రి నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. కేరళలోని మొత్తం 50 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారని పీఎఫ్ఐ నాయకులు వెల్లడించారు.
Tamil Nadu | NIA is conducting searches at 8 places in the Madurai city area including Villapuram, Gomatipuram, and Kulamangalam. pic.twitter.com/WxKihAMayW
— ANI (@ANI) September 22, 2022
కర్ణాటకలోని మంగళూరులో, తమిళనాడులోని మధురై, విల్లపురం, గోమతీపురం, కులమంగళం, తేనీ, దిండిగుల్, రామనాథపురం, కడలూరు, తిరునల్వేలీ, టెంకాసీ ప్రాంతాల్లోని పీఎఫ్ఐ, ఎస్డీపీఐ కార్యకర్తల ఆస్తులపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. కడలూరు పీఎఫ్ఐ అధినేత ప్యాజ్ అహ్మద్, మధురై జిల్లా కార్యదర్శి యాసర్ అరాఫత్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Karnataka Police detained PFI and SDPI workers protesting against NIA raid in Mangaluru https://t.co/UB1PMTkP82 pic.twitter.com/70Fy4BQZOc
— ANI (@ANI) September 22, 2022