హైదరాబాద్ : నాందేడ్లో నిర్వహించిన భారీ బహిరంగ సభ సక్సెస్ అయిందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నాందేడ్ గురుగోవింద్ సింగ్ మైదానంలో ఆదివారం నిర్వహించిన సీఎం కేసీఆర్ సభ మహారాష్ట్ర, తెలంగాణ నాయకులు, గులాబీ శ్రేణులు సమష్టిగా కష్టపడి పనిచేశారని పేర్కొన్నారు.
తొలిసారిగా తెలంగాణ వెలుపల నాందేడ్లో సభకు రైతు సంక్షేమ సారథి, బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ను చూడాలని వేలాది మంది రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు. సీఎం కేసీఆర్ పట్ల అభిమానాన్ని చాటిన బీఆర్ఎస్ మహారాష్ట్ర ప్రజాప్రతినిధులు, ప్రజలు ముఖ్యంగా రైతులు, వృద్దులు, మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.సభ విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చిందన్నారు.
జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కు అనూహ్య స్పందన వస్తుందనడానికి ఈ సభ నిదర్శనం చెప్పారు.సభను విజయవంతం చేయడానికి సహకరించిన నాందేడ్ పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు, అనధికారులు, ప్రజాప్రతి నిధులు, రైతులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.