హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీ నివాస్రెడ్డికి న్యాయస్థానంలో ఊరట ల భించింది. 2018 శాసనసభ ఎన్నికల సమయంలో ఆయనపై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసును నాంపల్లి కో ర్టు కొట్టివేసింది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యుడు జకుల లక్ష్మణ్ గురువారం మీడియాకు వెల్లడించారు. 2018 ఎన్నికల సందర్భంగా మలక్పే ట్ పోలీస్స్టేషన్ పరిధిలోని మెట్రో పిల్లర్లపై పార్టీ గుర్తు (కారు సింబల్) ఉన్న పో స్టర్లు వేశారంటూ ఫ్లయింగ్ స్వాడ్ ఫి ర్యాదు చేసింది.
ఈ నివేదిక ఆ ధారంగా మలక్పేట్ పోలీసులు అప్పు డు పార్టీ ప్ర ధాన కార్యదర్శిగా ఉన్న శ్రీనివాస్రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కే సును సవా ల్ చేస్తూ బీఆర్ఎస్ లీగల్ టీమ్ తెలంగా ణ హైకోర్టును ఆశ్రయించిం ది. లీగల్ టీ మ్ వాదనలతో ఏకీభవించి న హైకోర్టు కేసును క్వాష్ చేస్తూ ఉత్తర్వు లు ఇచ్చిం ది. ఆ క్వాష్ ఉత్తర్వులను నాం పల్లి కో ర్టులో సమర్పించడంతో, ఈ కేసు ను పూర్తిగా కొట్టేస్తున్నట్టు ప్రకటించింది.