ముంబై: ఈ సీజన్లో మూడో మ్యాచ్ గెలిచిన ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా పడింది. గురువారం పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ‘స్లో ఓవర్ రేట్’ కారణంగా అతడికి జరిమానా విధిస్తున్నట్టు ఐపీఎల్ పాలకమండలి ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ సీజన్లో ఇప్పటివరకూ సంజూ శాంసన్, రిషభ్ పంత్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ జరిమానాలు ఎదుర్కొన్నారు.