హైదరాబాద్ : దేశానికే ఆదర్శంగా ముఖరా (కే) గ్రామం నిలిచిందని, ఇవ్వాళ దేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఆ గ్రామ మోడల్ ను అనుసరిస్తున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆ గ్రామాన్ని అంతగా తీర్చిదిద్ది రాష్ట్రానికి గొప్ప పేరు తెచ్చిన గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, కార్యదర్శిని మంత్రి అభినందించారు.
ఇటీవల పూణేలో జరిగిన పంచాయతీ రాజ్ సమ్మేళనం లో పాల్గొని అత్యున్నత ప్రతిభ కనబరచిన గ్రామంగా మరోసారి గుర్తింపు పొందిన సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ గాడ్గె మినాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్ను మంత్రిని మంగళవారం హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో కలిశారు.
ఈ సందర్భంగా పూణేలో పొందిన అవార్డు ను మంత్రి కి చూపించారు. వారిని అభినందించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ..పూణేలో జరిగిన జాతీయ స్థాయి పంచాయతీ రాజ్ సమ్మేళనంలో పాల్గొన్న దేశంలోని 5 గ్రామాల్లో ముఖ రా కే గ్రామం అత్యున్నత స్థానం పొందిందని తెలిపారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక పథకాలు గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నాయని తెలిపారు. ఇదే పనితీరును కొనసాగించాలని వారికి మంత్రి సూచించారు.