సంగారెడ్డి అర్బన్, డిసెంబర్ 29 : టీఆర్ఎస్ హ యాంలోనే ముదిరాజ్లకు గుర్తింపు వచ్చిందని మాజీ రాజ్యసభ సభ్యుడు, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ అన్నారు. బుధవారం సంగారెడ్డిలో ముదిరాజ్ మహాసభ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం.. తెలంగాణ రాష్ర్టామేనన్నారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్సీకి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, యువత విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు రాజు, జిల్లా నాయకులు నగేశ్, రమేశ్, రఘు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.