చింతకాని : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లె పాఠశాలల్లో పండుగ వాతావరణం తీసుకురావాలని ఎంపీడీవో బీ రవికుమార్ అన్నారు. మండల పరిధిలో ఆయా గ్రామాల్లో సర్పంచులతో కలసి పాఠశాలల్లో జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించి పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1నుంచి కేజీ టూ పీజీ వరకు విద్యాసంస్ధలు ప్రారంభం కానున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌళిక వసతులు కల్పించాలని సిబ్బందికి సూచించారు.
తరగతి గదుల్లో శానిటేషన్ పూర్తి చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్, సర్పంచులు, ఉపసర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.