లక్నో, జనవరి 12: ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో ప్రతి రోజు ఒకరిద్దరు మంత్రులు రాజీనామా చేస్తారని ఓబీసీ నేత, సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్భర్ అన్నారు. ఈ నెల 20 నాటికి 18 మంది మంత్రులు రాజీనామా చేస్తారని పేర్కొన్నారు. మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్ రాజీనామాలను ఆయన స్వాగతించారు. ‘దళితులు, వెనుకబడిన వర్గాలపై బీజేపీ నిర్లక్ష్యాన్ని నేను గతంలోనే అర్థం చేసుకొన్నాను. పొత్తు నుంచి బయటకు వచ్చాను. వీళ్లు ఇన్ని రోజులు ఓపిక పట్టారు. నిరాశ తప్ప వారికి ఏం మిగల్లేదు. ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు’ అని రాజ్భర్ అన్నారు.