తెలుగు రాష్ట్రానికి చెందిన బిషప్ పూల ఆంథోనికి కార్డినల్ గా అరుదైన అవకాశం దక్కడం ఎంతో సంతోషించదగ్గ విషయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మంగళవారం ఆమె కంటోన్మెంట్లోని బిషప్ పూల ఆంథోనీ నివాసానికి వెళ్లి, ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు.
బిషప్ పూల ఆంథోనిని ఎమ్మెల్సీ కవిత సన్మానించారు. కార్డినల్గా ఎంపికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె వెంట ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, ఎమ్మెల్యే స్టీఫెన్సన్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్, మతపెద్దలు శంకర్లూక్, రాజీవ్ సాగర్, రాయ్డన్, కృపాదానం, తదితరులున్నారు.