భీమదేవరపల్లి, నవంబర్ 2 : బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ హుస్నాబాద్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని కొప్పూరు, రత్నగిరి, గాంధీనగర్, మాణిక్యాపూర్, వంగర, రంగయ్యపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రతిఇంటికి సంక్షేమ ఫలాలు అందాయన్నారు. తెలంగాణ రాకముందు గ్రామాలు ఎలా ఉన్నాయో, ఎటువంటి బాధలు పడ్డామో మీకు తెలియదా అని ప్రశ్నించారు. రాష్ట్రం సిద్ధించాక పల్లెలన్నీ ప్రగతిపథంలో పయనిస్తున్నాయన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్దికి పాటుపడిన తనను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ సీఎంగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని, హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన ఎమ్మెల్యే సతీశ్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ హుస్నాబాద్, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ ప్రాంతానికి తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు. ఎమ్మెల్యే సతీశ్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపిం చాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాయ మాటలతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తారని, వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అక్కడ సీఎంగా కేసీఆర్, ఇక్కడ ఎమ్మెల్యేగా మూడోసారి సతీశ్కుమార్ ప్రమాణ స్వీకారం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్, ఎంపీపీ జక్కుల అనిత, జడ్పీటీసీ వంగ రవి, సర్పంచులు ఎంపీటీసీలు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారుపాటి మహేందర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.