ఇతర పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష
మెదక్, డిసెంబర్ 28 : అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్లోని తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సర్పంచ్లు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పల్లె ప్రగతి కింద చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు మం జూరు చేస్తున్నదని, సర్పంచ్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతున్నదన్నారు. పనులకు సంబంధించిన బిల్లు చెల్లించేలా పంచాయతీరాజ్శాఖ అధికారులను ఆదేశించారు.
వేసవిలో విద్యుత్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, వరికి బదులు ఇతర పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులకు ఆమె సూచించారు. హరితహారంలో భాగంగా గ్రామాల్లో నాటిన మొక్కల సంరక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామీణ ఉపాధి హామీ పథకం పీడీ సర్పంచ్లకు సూచించారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ కనకరత్నం, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కమలాకర్, వ్యవసాయశాఖ అధికారి పరశురాంనాయక్, ఆర్అండ్బీ డీఈ వెంకటేశం, పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈ పాండురంగారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ విజయభాస్కర్రెడ్డి, ట్రాన్స్కో డీఈ కృష్ణారావు, మెదక్ తహసీల్దార్ భానుప్రకాశ్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్ గ్రిడ్ ఏఈలు సల్మాన్రాజ్, రియాజ్, సుధాకర్, జావిద్, తరుమలేశ్, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టు కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ..
మెదక్ సీనియర్ జర్నలిస్టు మహమ్మద్ ఫారూక్ హుస్సే న్ తండ్రి ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఫారూక్ హుస్సేన్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు జయరాజ్, విశ్వం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, నాయకులు లింగారెడ్డి, రాగి అశోక్, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శంకర్దయాల్చారి తదితరులు ఉన్నారు.