హైదరాబాద్ : మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నిర్వహించే రోడ్ షోలను(Road show) విజయవంతం చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Mallareddy) అన్నారు. మేడ్చల్లో ఈ నెల 4 న జరిగే రోడ్ షో స్థలాన్ని మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని వర్గాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు లభిస్తుందన్నారు. కేటీఆర్ రోడ్ షోకు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని మల్లారెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమన్నారు.