చర్లపల్లి, ఫిబ్రవరి 6 : చరపల్లి డివిజన్ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని ఈసీనగర్, డీసీ కాలనీ, శ్రీసాయి గణేశ్ నగర్ కాలనీవాసులకు సీసీ రోడ్డు మంజూరు చేయడంతో కాలనీవాసులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చర్లపల్లి డివిజన్లో ఈసీనగర్ కాలనీకి 58లక్షలు, డీసీ కాలనీకి 44లక్షలు, శ్రీసాయిగేణేశ్ కాలనీకి 24లక్షలు సీసీ రోడ్లు నిర్మాణానికి మంజూరు చేశామని, త్వరలో పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
అదేవిధంగా కాలనీలలో పూర్తి స్థాయిలో డ్రైయినేజీ పనులు చేపట్టనున్నామని ఆయన తెలిపారు. నియోజకవర్గ పరిధిలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు నేమూరి మహేశ్గౌడ్, నాయకులు శ్రావణ్కుమార్గౌడ్, ఒడయ్య, రవి, డప్పు గిరిబాబు, అనంత్రాజ్, సత్తిరెడ్డి,కడియాల బాబు, కొల నరేశ్, వేణుగోపాల్రెడ్డి, ప్రసాద్, బిక్షపతి, పద్మిని, రాజు, శ్రీకాంత్రెడ్డి, మోహన్, మూర్తి, రమణ్కుమార్, బాల్రాజ్, మల్లేశ్, శేఖర్ ప్రసాద్, రామకృష్ణారెడ్డి, నర్సింహ్మరెడ్డి, నరేశ్, విషయ్ తదితరులు పాల్గొన్నారు.