గోల్నాక, ఏప్రిల్ 9 : అంబర్పేట నియోజకవర్గం పరిధిలో అద్దె భవనాల్లో కొనసాగుతోన్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. గురువారం గోల్నాక క్యాంపు కార్యలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం నుంచి మంజూరైన స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గంలోని 34 అంగన్వాడీ కేంద్రాల్లో ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనతో పాటు చిన్నారులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రతి కేంద్రంలో చిన్నారులకు ఫ్రీ ప్రైమరీ విద్య, పౌష్టిక ఆహారంతో పాటు గర్భిణిలు, బాలింతలకు సముచిత పౌష్టికాహారంపై దృష్టి సారించామని అన్నారు. నియోజకవర్గలో ఖాళీగా ఉన్న 9 మంది టీచర్లను భర్తీ చేయలాని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్ వైజర్లు శారద, శ్వేత తో పాటు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.