హైదరాబాద్, ఆగస్టు6(నమస్తే తెలంగాణ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో ఓటరు నమోదు కు ఫ్యామిలీ సర్టిఫికెట్ను ఆధార పత్రం గా స్వీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఎన్నికల సంఘాల నుంచి వివరణ కోరింది.
సామాజిక కా ర్యకర్త టీ అమర్సింగ్ దాఖలు చేసిన పి టిషన్పై విచారణ సందర్భంగా పిటిషన ర్ తరఫు న్యాయవాది వాదిస్తూ, గత నెల 25న ప్రభుత్వం జారీచేసిన జీవో 172 ప్రకారం కుటుంబ నమోదు ధ్రువీకరణ పత్రం కేవలం రేషన్కార్డుల జారీ కోసం ఉద్దేశించినదని తెలిపారు. ఆ పత్రాన్ని ఓటరు నమోదుకు అర్హత నిర్ధారించే ప్రధాన ఆధారంగా స్వీకరించడం చట్టబద్ధం కాదని వాదించారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల సంఘాలు వివరణ సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.