ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రామన్నపేట, డిసెంబర్ 26 : ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో వెలుగులు నింపుతున్నాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఎన్నారం, కుంకుడుపాముల, తుర్కపల్లి, బాచుప్పల గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతి వనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. రూ.20లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. కేసీఆర్ ముందు చూపుతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల వల్లే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. కేంద్రం ఇది చూసి తట్టుకోలేక ధాన్యం కొనుగోలుపై కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. రైతులు యాసంగిలో వరి వేసి ఇబ్బంది పడవద్దనే ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తున్నదన్నారు. ఉనికి లేని బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.
రాజకీయాలను పక్కనబెట్టి గ్రామస్తులంతా ఏకతాటి పైకి వచ్చి అభివృద్ధే ఎజెండాగా పనిచేయాలన్నారు. పల్లె ప్రగతి పనులతో అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని నిరూపించామన్నారు. ఎన్నారం గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయం, పీర్ల కొట్టం నిర్మాణానికి, పాఠశాల ప్రహరీ, తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. కుంకుడు పాముల గ్రామంలో యాదవ, ఎస్సీ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి, ట్యాంక్ ఏర్పాటు చేయిస్తానన్నారు. బి.తుర్కపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ భవనం, తుర్కపల్లి అమ్మనబోలు గ్రామాల మధ్య కల్వర్టు ఏర్పాటుకు హామీనిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్మోహన్, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డి, సర్పంచులు మెట్టు మహేందర్రెడ్డి, బొక్క యాదిరెడ్డి, చెరుకు సోమయ్య, బొక్క కృష్ణవేణి, ఎంపీటీసీలు దోమల సతీశ్, ఏనుగు పుష్పావెంకట్రెడ్డి, ఎండీ.ఆమేర్, గుత్తా నర్సింహారెడ్డి, మండల కార్యదర్శి పోచబోయిన మల్లేశం, మెట్టు శ్రీనివాస్రెడ్డి, బొక్క మాధవరెడ్డి, పట్టణాధ్యక్షుడు పోతరాజు సాయికుమార్, మందడి శ్రీధర్రెడ్డి, పిట్ట కృష్ణారెడ్డి, ఉప్పు ప్రకాశ్, బద్దుల రమేశ్, బత్తుల వెంకటేశం, పల్సం భిక్షం, సుధాకర్రెడ్డి, బొబ్బల శిల్ప, గొండ్యిల పద్మ, పరమేశ్, శంకర్ పాల్గొన్నారు.