Loksabha Elections : రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన భార్యకు టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే భరత్ చంద్ర నరహ్ రాజీనామా చేశారు. అసోంలోని లఖింపూర్ జిల్లా నౌబైచ నియోజకవర్గానికి భరత్ చంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
లఖింపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తన భార్య, మాజీ ఎంపీ రాణీ నరాహ్కు కాంగ్రెస్ టికెట్ నిరాకరించింది. పార్టీ తీరుతో మనస్తాపం చెందిన భరత్ చంద్ర నరాహ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖలో ఆయన స్పష్టం చేశారు.
పార్టీ ఎమ్మెల్యే నరాహ్ రాజీనామాను సీఎల్పీ నేత దేవబ్రత సైకియా ధ్రువీకరించారు. అసోంలోని 14 లోక్సభ స్ధానాలకు మూడు దశల్లో ఏప్రిల్ 19, 26, మే 7 తేదీల్లో పోలింగ్ జరగనుంది. కాగా, 2019 ఎన్నికల్లో బీజేపీ 9 స్ధానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 3 స్ధానాలను, ఏఐయూడీఎఫ్ ఒక స్ధానాన్ని కైవసం చేసుకున్నాయి.
Read More :