ములుగు : మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆలం రాంమ్మూర్తి ఇటీవల గుండె పోటుతో ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ మేడారంలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాంమ్మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. మంత్రి వెంట ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి ఆలయం అత్యద్భుతం : ఏపీ మంత్రి పేర్ని నాని
విమర్శల పాలవుతున్న ప్రగ్యా ఠాకూర్.. ఎందుకంటే.?
పేదలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం
సానియా మీర్జా, షోయెబ్ జంటకు యూఏఈ గోల్డెన్ వీసా జారీ