హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్లో గల ఆర్కే సినీ మాక్స్లో ‘గాంధీ’ సినిమాను చూసేందుకు వచ్చి ప్రమాదానికి గురైన భారతీయ విద్యాభవన్ పాఠశాల విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కలెక్టర్ను ఆదేశించారు. భారతీయ విద్యాభవన్ పాఠశాల విద్యార్థులు గురువారం సినీ మాక్స్లోని ‘గాంధీ’ సినిమాను చూసేందుకు వచ్చారు.
ఎస్కలేటర్పై వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలిసిందని మంత్రి పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన విద్యార్థులకు చికిత్స అందిస్తున్న అపోలో ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు దేవసేనను మంత్రి ఆదేశించారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాల సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు గాంధీ చిత్ర ఉచిత ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా సినిమా ప్రదర్శన సందర్భంలో మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.