తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చివరదశకు చేరుకున్నది. బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లా రెడ్డి ఘన విజయం సాధించారు. ఇద్దరు అభ్యర్థులు తొలి రౌండ్ నుంచే ప్రత్యర్థులపై పూర్తి మెజార్టీ కనబర్చారు. బాన్సువాడలో కాంగ్రెస్ అభ్యర్థిపై స్పీకర్ పోచారం 23,582 ఓట్లతో గెలుపొందారు. దీంతో అసెంబ్లీ స్పీకర్ ఓడిపోతారన్న సాంప్రదాయాన్ని పోచారం తిరగరాశారు.