Hyderabad Metro | కుత్బుల్లాపూర్ జోన్ బృందం, నవంబర్16:ట్రాఫిక్కు అంతరాయం లేకుండా కుత్బుల్లాపూర్కు మెట్రోలైన్ తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఐడీపీఎల్ చౌరస్తాతో పాటు షాపూర్నగర్ చౌరస్తాలో జరిగిన రోడ్షోలో ఆయన ప్రసంగించారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు సమన్వయంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.
ప్రధానంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు మెట్రోమార్గంతో పాటు అవసరమైన చోట్ల ఫైఓవర్లు, విశాలమైన రోడ్లను అభివృద్ధి చేసేందుకు తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని చెప్పారు. సూపర్మ్యాక్స్ కార్మికులు ఇటీవలే తన వద్దకు వచ్చి తమ బాధను వ్యక్తం చేశారని, వారికి శాశ్వత పరిష్కారం చూపేందుకు, అవసరమైన మరో కొత్త కంపెనీని ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.