హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ గ్రావ్టన్ మోటార్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ బృందానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కేటీఆర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ కంపెనీ తెలంగాణలోనే తొలి ఎలక్ట్రిక్ బైక్ను రూపొందించి ఇటీవల విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆ బృందాన్ని అభినందించారు. అయితే ఎలక్ట్రిక్ బైక్ రూపొందించిన కోర్ టీమ్లో తమ సిరిసిల్ల కుర్రాళ్లు ఉన్నారని చెప్పడానికి గర్వపడుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ బైక్పై కన్యాకుమారి నుంచి లడఖ్లోని ఖర్దుంగ్ లా వరకు నాన్స్టాప్గా రైడ్ చేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈ బృందం చేరింది. ఈ క్రమంలో గ్రావ్టన్ మోటార్స్ కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
క్వాంటా పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ బైక్ కేవలం రూ.80 ఖర్చుతో 800 కిలోమీటర్ల మైలేజి ఇవ్వగలదని కంపెనీ ఇటీవల వెల్లడించింది. ప్రమోషనల్ ఆఫర్గా ధరను రూ.99,000గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వపు ‘గో ఎలక్ట్రిక్’ ప్లాట్ఫామ్లో క్వాంటాను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్రంజన్ చేతుల మీదుగా ఆవిష్కరింపచేసినట్లు గ్రావ్టన్ వ్యవస్థాపకుడు, సీఈఓ పరశురామ్ పాకా తెలిపారు.
రూ.80కే.. 800 కిలోమీటర్ల ప్రయాణం
బీఎల్డీసీ మోటర్తో గరిష్ఠంగా గంటకు 70 కిలోమీటర్ల వేగం
ఒక్కసారి ఛార్జ్చేస్తే 150 కిలోమీటర్ల ప్రయాణం, 320 కిలోమీటర్ల వరకూ పెరిగే అవకాశం
ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్లో 90 నిముషాల్లో బ్యాటరీ ఛార్జింగ్
బ్యాటరీకి 5 ఏండ్ల వారెంటీ
రోడ్సైడ్ అసిస్టెన్స్, మ్యాపింగ్ సర్వీస్ స్టేషన్స్,రిమోట్ లాక్/ఆన్లాక్ ఫీచర్లతో స్మార్ట్ యాప్
మూడు రంగుల్లో లభ్యమయ్యే ఈ బైక్ను కంపెనీ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు
Congratulations to Team @GravtonMotorsEV
for developing and building the first completely "Made in Telangana" EV with swappable batteries. I am proud to say the core team hails from our very own Siricilla pic.twitter.com/D9voBui085— KTR (@KTRTRS) February 4, 2022