మంత్రి కొప్పుల ఈశ్వర్
కొండగట్టు ఘాట్రోడ్పై వాహనాల రాకపోకలు పునఃప్రారంభం
ప్రారంభించిన అమాత్యుడు
మంత్రి ఈశ్వర్ సమక్షంలో ఎమ్మెల్యే రవిశంకర్ జన్మదిన వేడుకలు
మల్యాల, జూన్ 30 : రూ.కోటికిపైగా నిధులతో కొండగట్టు ఘాట్రోడ్డుకు రక్షణ చర్యలు చేపట్టామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా మూసివేసిన ఘాట్రోడ్డుపై లైట్ మోటార్ వాహనాల రాకపోకలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం రాకపోకలను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. కొండగట్టు ఘాట్రోడ్డుపై ప్రమాదం జరిగిన తర్వాత రాష్ట్ర స్థాయి రోడ్డు రవాణా, సేఫ్టీ అథారిటీ ఉన్నతాధికారులు అప్పట్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారని గుర్తు చేశారు. తిరిగి రూ.కోటికిపైగా నిధులు వెచ్చించి ఘాట్రోడ్డుకు దిద్దుబాటు పలు చర్యలు చేపట్టామన్నారు. రోడ్లు, భవనాల శాఖాధికారులు, రవాణా శాఖాధికారులు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పడంతో తిరిగి ప్రారంభించామన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే రవిశంకర్, జడ్పీటీసీ కొండపలుకుల రాంమోహన్రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి నెల రోజులుగా ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం అమోఘమన్నారు.
ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ, తన జన్మదినం రోజుల ఈ ఘాట్రోడ్డును పునఃప్రారంభించడం నా జీవితంలో మరిచిపోలేనిదనన్నారు. ఈ రోడ్డు ప్రారంభం ఎంతో మంది చిరువ్యాపారుల కుటుంబాల్లో వెలుగు నింపుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే, జడ్పీటీసీ, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు, సర్పంచ్ను స్థానికులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ త్రినాథ్, ఎంపీటీసీ రేణుక, సహకార సంఘాల అధ్యక్షులు బోయినిపల్లి మధుసుదన్రావు, ముత్యాల రాంలింగారెడ్డి, అయిల్నేని సాగర్రావు, మేన్నేని రాజనర్సింగరావు, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు జనగం శ్రీనివాస్, ఆర్బీఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొరండ్ల నరేందర్రెడ్డి, నాయకులు పునుగోటి కృష్ణారావు, మోత్కు కొమురయ్య, కోటేశ్వర్ రావు, పంజాల మల్లేశం, పంజాల శ్రీనివాస్, కాటిపల్లి శ్రీనివాస్రెడ్డి, ఆసం శివకుమార్, గడికొప్పుల రమేశ్, ఆగంతం వంశీ, మల్యాల గణేశ్, పూడూరి చందు, గుర్రం మల్లేశం గౌడ్, మునుగూరి రాకేష్, జోగినిపల్లి శ్రీనివాస్గౌడ్, బద్దం తిరుపతి, మల్యాల, కొడిమ్యాల మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.