జవహర్నగర్, డిసెంబర్ 27 : జవహర్నగర్ కార్పొరేషన్ స్థాయికి అనుగుణంగా 100 పడకల హాస్పిటల్ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు కార్పొరేటర్ నిహారిక వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ జవహర్నగర్ కార్పొరేషన్లో అధికంగా పేద ప్రజలు నివసిస్తున్నారని, అనారోగ్యానికి గురైనప్పుడు వైద్య ఖర్చులు భరించలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సకల వసతులతో కూడిన హాస్పిటల్ను ఏర్పాటు చేయాలని మంత్రికి విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.