జనగామ : అందరి సంక్షేమమే ధ్యేయంగా ఆలోచించి పనిచేస్తున్న పార్టీగా బీఆర్ఎస్ చరిత్రలో నిలిచిపోతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సైనికుల లాంటి కార్యకర్తల కోసం బీమా చేసి, ఆ కుటుంబాలను ఆదుకుంటున్న పార్టీ కూడా బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.
అనుభవం గల సీఎం కేసీఆర్ అధ్యక్షతన, కేటీఆర్ లాంటి యువ నాయకత్వంలో నడుస్తున్న పార్టీకి ప్రజల అండదండలు కూడా మెండుగా ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో స్వరాష్ట్రాన్ని కేసీఆర్ మరోసారి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో చిల్లర రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు. అనంతరం కాంగ్రెస్ నుంచి కొడకండ్ల మాజీ ఎంపీటీసీ మస్రం సువర్ణ మోహన్ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.