నల్లగొండ : నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి గ్రామ శివారులో అద్దంకి-నార్కెట్ పల్లి రహదారి ఆగివున్న డీసీఎంను నల్లగొండ మినీ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 13 మందికి గాయాల య్యాయి. అరుణాచలం నుండి హైదరాబాద్ వెళుతున్న మినీ బస్సు నార్కట్పల్లి శివారులోకి రాగానే డీసీఎంను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవరు రెండు కాళ్లు విరిగాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
KTR | బాల్క సుమన్ మాటలు తప్పయితే.. రేవంత్ రోత భాష కూడా తప్పే.. ఆయనపై కేసు పెట్టరా?: కేటీఆర్
Irumudi Glimpse | ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’.. రవితేజ-శివ నిర్వాణ కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్