మొయినాబాద్, ఆగస్టు 2 : పట్నం రుక్కమ్మ దశదినకర్మ ఆదివారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి హిమాయత్నగర్ రెవెన్యూలో గల జేపీఎల్ కన్వెన్షన్ హాల్లో జరిగింది. దీనికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, జగదీశ్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత కార్తిక్రెడ్డి తదితరులు హాజరై రుక్కమ్మ చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డిలతోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా పాల్గొని రుక్కమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.
