హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు, ఆంధ్ర జ్యోతి బ్యూరో చీఫ్,మెండు శ్రీనివాస్ హఠన్మరణం పట్ల మీడియా అకాడమీ చైర్మన్, అల్లం నారాయణ సంతాపం ప్రకటించారు. శ్రీనివాస్ మరణం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి పత్రికలో తనతో కలసి పనిచేసిన రోజులు గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే శ్రీనివాస్ హఠన్మరణం పట్ల సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు బి. రాజమౌళి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.
కాగా, శ్రీనివాస్ వరంగల్ జిల్లాలోని తన స్వగ్రామం పరకాలలో తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో స్థానిక దవాఖానలో చేరారు. అయితే చికిత్స పొందుతూ చనిపోయారు. శ్రీనివాస్ ప్రస్తుతం ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరోచీఫ్గా పనిచేస్తున్నారు.