న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ‘నా తమ్ముడికి ఓటేస్తే కావేరీ జలాలు అందిస్తాం’ అంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్పై పోలీసు కేసు నమోదైంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. బెంగళూరు గ్రామీణ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న తన సోదరుడు డీకే సురేశ్ తరపున డీకే శివకుమార్ ఇటీవల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఓ హౌసింగ్ సొసైటీకి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన వాళ్లతో మాట్లాడుతూ “నేనొక ‘బిజినెస్ డీల్’ కోసం ఇక్కడకు వచ్చాను. మీరు నా సోదరుడికి ఓటేస్తే.. మీకు కావేరీ జలాలు సరఫరా అయ్యేలా చూస్తాను” అని అక్కడ ప్రజలకు చెప్పినట్టు ఆరోపణలు వచ్చాయి. డీకే ప్రసంగం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఎన్నికల్లో లంచం, అనుచిత ప్రభావం కింద కే సు నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.