మెదక్ రూరల్/ నిజాంపేట/ నర్సాపూర్/ మనోహరాబాద్/ అల్లాదుర్గం/ కొల్చారం/ తూప్రాన్/ చిన్నశంకరంపేట, జూలై 12 : మెదక్ మండలంలో మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండావర్షం కురుస్తున్నది. భారీ వర్షాల కు బోల్లారం వాగు మత్తడి దూకుతున్నది. రాయిన్పల్లి, పాతూరు, కొంటూరు గ్రామాల్లోని చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. వ్యవపాయ ప నులు, వరి నాట్లు జోరుగా కొనసాగుతున్నాయి.
ఏకధాటిగా కురుస్తున్న వర్షం
నిజాంపేట మండలవ్యాప్తంగా ఐదు రోజలు గా వర్షం ఏకధాటిగా కురుస్తూనే ఉంది. మంగళవారం వీచిన బలమైన ఈదురు గాలులకు నార్లపూర్ గ్రామంలో ఓ ఇంటిపై చెట్టు కూలింది. విద్యుత్ అధికారులు అప్రమత్తమై కాసేపు విద్యుత్ సరఫరాను నిలిపివేసి అనంతరం పునరుద్ధరించారు.
నర్సాపూర్ మండలంలో 42 ఇండ్లు ధ్వంసం : ఎంపీవో శ్రీనివాస్
నర్సాపూర్ మండలంలో ఇప్పటివరకు 42 ఇండ్లు పాక్షిక కంగా కూలాయని, రెండుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని ఎంపీవో శ్రీనివాస్ తెలిపారు. పెద్దచింతకుంట గ్రామంలో కూలిన ఇం టిని సర్పంచ్ శివకుమార్ పరిశీలించారు. నర్సాపూర్ మున్సిపాలిటీలోని 7వ వార్డులో మహ్మద్ షకిల్ ఇల్లు కూలింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీవో సూచించారు.
చెరువులు, కుంటలను పరిశీలిస్తున్న నాయకులు
మనోహరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్లు పా క్షికంగా దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నాయకులు, ప్రజాప్రతినిధులు చెరువులు, కుంటలను పరిశీలించి, పరిస్థితులను పరిశీలిస్తున్నారు. కాళ్లకల్లోని ఊర చెరువును స్థానిక నాయకుడు పురం రవి, ఉప సర్పంచ్ రాజుయాదవ్ పరిశీలించారు.
ఎడతెరిపి లేని వర్షాలతో కూలిన ఇండ్లు
అల్లాదుర్గం మండలంలో ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న వర్షాలతో గ్రామాలన్నీ తడిసి ముద్దవుతున్నాయి. పలు గ్రామాల్లో ఇండ్లు కూలిపోతున్నాయి. కాయిదంపల్లిలో రెండు ఇండ్లు, చిల్వెరలో ఒక ఇల్లు కూలిపోయింది.
కొల్చారం మండలంలో మంజీరానదిపై మూడు చెక్డ్యాం లు, హల్దీవాగుపై ఉన్న చెక్డ్యాం నిండుకుండను తలపిస్తున్నా యి. వరిగుంతం, ఎనగండ్ల గ్రామాల్లో ఇల్లు కూలాయి.
తూప్రాన్ మండలంలో 21 ఇండ్లు ధ్వంసం
తూప్రాన్ మండలంలో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షం తో చెరువులు, కుంటలు, వాగులు, చెక్డ్యామ్ల్లో భారీగా వరద చేరుతున్నది. తూప్రాన్ మండల వ్యాప్తంగా 21 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తూప్రాన్ మండలంలో మంగళవారం 22.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిన్నశంకరం పేట మండలంలో జంగరాయిలో కూలిన ఇంటిని సర్పంచ్ జ్యోతి, టీఆర్ఎస్ నేతలు ప్రభాకర్, శ్రీనివాస్ పరిశీలించారు.