సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 23: పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో జహీరాబాద్ స్థానానికి మంగళవారం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో బీజేపీ అభ్యర్థి బీబీపాటిల్, ఇండియా ప్రజా బంధు పార్టీ నుంచి బాబు దుర్గయ్య రోమల, అలియెన్స్ ఆఫ్ డెమొక్రెటిక్ రీఫార్మ్స్ పార్టీ నుంచి మణి చావగాని నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి వల్లూరు క్రాంతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభ్యర్థులకు సంబంధించిన ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర వివరాలను నోటీస్ బోర్డుపై ఉంచనున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్ సైట్లోనూ అప్లోడ్ చేస్తామన్నారు.
మెదక్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మంగళవారం 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేసినట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు తరఫున రెండో సెట్ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నర్సాపూర్ నాయకుడు మురళీధర్యాదవ్ దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా తుపాకుల మురళీకాంత్, కె.సత్యనారాయణగౌడ్, కొలూరి ప్రతాప్, చిక్కుపల్లి నవీన్, మాడి శ్రీనివాస్రెడ్డి నామినేషన్లు వేశారు. ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా కె.బంగారయ్య, ప్రజా వెలుగు పార్టీ నుంచి సారా యాదగిరి, ఇండియా ప్రజా బంధు పార్టీ నుంచి మైసన్గారి సునీల్, తెలంగాణ ప్రజాశక్తి పార్టీ నుంచి దొడ్ల వెంకటేశం నామినేషన్లు దాఖలు చేశారు.