పెద్దశంకరంపేట, ఏప్రిల్ 23: సీఎం రేవంత్రెడ్డి సభను విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ నెల 26న మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించే సీఎం ఎన్నికల ప్రచార సభాస్థలి ఏర్పాట్లను జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి కలిసి మంగళవారం పరిశీలించారు. హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి, సభను విజయవతం చేసేలా ఏర్పాట్లు చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. సభకు అన్ని గ్రామాల నుంచి ప్రజలను భారీగా తరలించాలన్నారు.
విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రణాళికా సంఘం మాజీ అధ్యక్షుడు నగేశ్ షెట్కార్, పీసీసీ సభ్యుడు కర్నె శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాయిని మధుసూదన్, నాయకులు సురేందర్రెడ్డి, ఆర్ఎన్ సంతోష్, రాజేందర్గౌడ్, సత్యనారాయణ, దేవేందర్, పెరుమాల్గౌడ్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.