సత్తుపల్లి టౌన్, ఏప్రిల్ 23: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం సత్తుపల్లిలోని శ్రీలక్ష్మీప్రసన్న ఫంక్షన్హాల్లో సత్తుపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా, యువత విభాగ ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో జరిగిన వైఫల్యాలపై ప్రశ్నించాలని, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి పార్లమెంట్ ఎన్నికల్లో తన గెలుపునకు కృషి చేయాలని కోరారు.
దేశంలో ఎక్కడా జరుగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం లో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలందరూ సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతిఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, నాయకులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, దొడ్డా శంకర్రా వు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, యాగంటి శ్రీనివాసరావు, మట్టా ప్రసాద్, షేక్ రఫీ, అంకమరాజు, అలవాల వెంకట్రావు, పాలెపు రామారావులతో పాటు ఆయా మండలాల యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.
కూసుమంచి, (నేలకొండపల్లి), ఏప్రిల్ 23: బీఆర్ఎస్తోనే రాష్ట్ర హక్కుల సాధన సాధ్యమవుతుందని ఎంపీ, ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నా రు. నేలకొండపల్లిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో నామా మాట్లాడారు. ఖమ్మం ఎంపీ గా తాన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించి రాష్ట్ర హక్కులపై నిత్యం పోరాడానన్నారు. మరోసారి అవకాశం కల్పిస్తే శక్తి వంచన లేకుండా హక్కుల కోసం పో రాడతానని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నాలుగు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ప్రతి కార్యకర్త ఇంటింటికి వె ళ్లి బీఆర్ఎస్ చేసిన పథకాలు తెలియజేయాలని అన్నా రు. కాంగ్రెస్ మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, నాయకులు బెల్లం వేణు, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం, ఏప్రిల్ 23: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరావు గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి జనంలోకి కందాళ రావడంతో కార్యకర్తలు నూతనోత్సాహంతో ఉన్నారు. నామా నాగేశ్వరరావు తరుపున ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం ప్రారంభించారు. ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక విస్తృతస్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.