సంగారెడ్డి/ మెదక్ (నమస్తే తెలంగాణ)/ గజ్వేల్, ఏప్రిల్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం రాక తో రియల్ ఎస్టేట్ రంగానికి గ్రహణం పట్టిం ది. రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత రియ ల్ ఎస్టేట్ వ్యాపారం నెమ్మదించింది. ప్రస్తు తం రియల్ రంగంలో స్తబ్ధత నెలకొన్నది. దీంతో కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చి రియల్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వారు లబోదిబోమంటున్నారు. పెట్టుబడి వస్తే చాలు అన్న చందంగా రియల్ వ్యాపారులు ఆలోచిస్తున్నారు. క్రయవిక్రయాలు గతం లో ఎన్నడూ లేనివిధంగా తగ్గుముఖం పట్టాయి.
హైదరాబాద్కు సమీపంగా ఉన్న సంగారెడ్డి జిల్లాలో రియల్ వ్యాపారం గత కొన్నేండ్లుగా ఊపందుకుంది. కేసీఆర్ సర్కార్ ధరణి తీసుకురావడం, తహసీల్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండడం, వెంటనే మ్యుటేషన్ ఇవ్వడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగింది. పటాన్చెరు, సంగారెడ్డితోపాటు దూరంగా ఉన్న నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల్లోనూ భూముల క్రయవిక్రయాలు భారీగా జరిగాయి. ఇతర ప్రాంతాలవారు భూములు కొనేందుకు ఆసక్తి చూపడంతో ధరలు అమాంతంగా పెరిగి, రైతులకు లాభా ల పంట పండింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం ఢమాల్ అన్న ది. రైతులు ఆశించిన స్థాయిలో భూములకు ధరలు రావడంలేదు. దీంతో భూ క్రయవిక్రయాల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 60,458 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జిల్లాలో ప్రతి నెలా సుమారు 5వేల భూముల రిజిస్ట్రేషన్లు కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రిజిస్ట్రేషన్ల సంఖ్య ప్రతి నెలా 1500 లోపు తగ్గినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రియల్ రంగానికి శరాఘాతంలా మారుతున్నాయన్న విమర్శలున్నా యి. సంగారెడ్డి జిల్లాలో ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్లో మంజీరా పరివాహక ప్రాంతాల్లో భూముల కొని ఫామ్ ల్యాండ్ తయారు చేసి అమ్ముతున్నారు. గుంట, రెండు గుంటల భూముల రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం నిలిపివేశారు. దీంతో రియల్ వ్యాపారంపై ప్రభావం పడి ఆర్థికంగా నష్టపోతున్నట్లు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలింది. భూములు కొనడానికి ఎవరూ ముందుకొస్తలేరు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు రియల్ ఎస్టేట్ జోరుగా సాగింది. అప్పుడు రోజుకు 40 నుంచి 50 రిజిస్ట్రేషన్లు జరిగేవి. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి రోజుకు 5 కూడా అవడంలేదు. గతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట జాతర ఉండేది, నేడు జనాలు కరువయ్యారు. ఇంత దారుణంగా పడిపోవడం నేనెప్పుడూ చూడలేదు. – సామ్యానాయక్, రియల్ వ్యాపారి, నర్సాపూర్
సిద్దిపేట జిల్లాలో రియల్ వ్యాపారం ఢమాల్ అన్నది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం నెమ్మదించింది. వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి, ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. వ్యవసాయ భూమి ఎకరం రూ.కోటి పెట్టి కొనుగోలు చేసిన దాన్ని రూ.10 నుంచి రూ.20 లక్షలకు తక్కువకైనా విక్రయించుకునేందుకు సిద్ధంగా ఉ న్నారు. ఆ ధరకు కూడా కొనేందు కు ఎవరూ ముందుకు రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. గజ్వేల్ ప్రాంతం నుంచి కేసీఆర్ పోటీకి నిలవడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో రియల్ వ్యాపారం పుంజుకుంది. గజ్వేల్ అభివృద్ధ్దిపై కేసీఆర్ వరాల జల్లు కురిపించడంతో ఇతర ప్రాంతా ల నుంచి ఇక్కడికొచ్చి వ్యవసాయ భూము లు, ప్లాట్లు కొనుగోలు చేశారు. అప్పట్లో గజ్వేల్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా గుంటకు రూ.3 నుంచి రూ.4 లక్షలు పలికిన ధర కొద్ది రోజుల్లోనే ఏకంగా రెట్టింపునకు చేరింది. గజ్వేల్ వైపు రియల్ వ్యాపారులు, కొనుగోలుదారులు భారీగా రావడం తో భూముల ధరలు మరింత పెరిగాయి. నాలా కన్వర్షన్ అనుమతితో ప్లాట్ల అమ్మకా లు ఎక్కువగా జరిగాయి. వందకు పైగా లేఅవుట్లు ఏర్పాటు కావడంతో రియల్ వ్యా పారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది. గజ్వేల్ ప్రాంతం లో వ్యవసాయ భూమి ఎకరం రూ.40 లక్షల నుంచి రూ.4 కోట్ల వరకు కొనుగోలు, అమ్మకాలు జరిగా యి. ఎక్కువగా ములుగు, వర్గల్, మర్కూక్, గజ్వేల్, జగదేవ్పూర్ మండలాల్లో రియల్ వ్యాపారం జరిగింది. ఎకరాల నుంచి గుంటల్లో భూముల అమ్మకాలు జరిగాయి.
గజ్వేల్ మీదుగా రీజినల్ రింగ్ రోడ్డు వెళ్తుండడంతో మర్కూక్, వర్గల్, ములుగు మండలాల్లోని ఆయా గ్రామాల్లో వ్యవసాయ భూమి ఎకరం రూ.2కోట్ల పైనే పలికింది. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో ప్రస్తుతం ఈ భూమిని రూ.1.50 కోట్లకు అమ్మేందుకు సిద్ధ్దంగా ఉన్నా, కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. కేసీఆర్ ఉంటే ధైర్యంగా భూములు కొన్న హైదరాబాద్కు చెందిన రియల్టర్లు, ఇప్పుడు అసలే ముందుకు రావడం లేదు. జగదేవ్పూర్ సమీపంలో ఎనిమిదేండ్ల క్రితం సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ అనుమతితో లేఅవుట్ చేయగా, అప్పట్లో హైదరాబాద్కు చెందిన ఉద్యోగులు, వ్యాపారులు గజానికి రూ.6 వేలు వెచ్చించి కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారి గజానికి రూ.3 వేలకు విక్రయిస్తామని ముందుకొచ్చినా ఎవరూ కొనడం లేదని తెలిపారు.
కొత్త ప్రభుత్వం వస్తే వ్యాపారాలు పెరుగుతాయనుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా రియల్ భూం పడిపోతుందని ఊహించలేదు. నాలుగు నెలల నుంచి వ్యాపారమే లేదు. గతంలో తీసుకున్న ధరలకు ఇప్పటికి బాగా తేడా ఉంది. దాదాపు 30 శాతం వరకు ధరలు తగ్గిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు.
మెదక్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడకేసింది. భూముల క్రయవిక్రయాలు భారీగా తగ్గిపోయాయి. లేఅవుట్లలో ప్లాట్లు అమ్ముకోవడానికి వ్యాపారులు నానాపాట్లు పడుతున్నారు. కొంతమంది అప్పులకు వడ్డీలు కట్టలేక తకువ రేటుకు స్థలాలు అమ్ముకుంటున్నారు. ఏడాది క్రితం వరకు గ్రామీణ ప్రాంతాల్లోనూ భూముల కొనుగోలు, అమ్మకందార్లు, మధ్యవర్తుల హడావిడితో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా ఉండేది. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో రోడ్డు పకన ఉన్న భూములు, ప్రధాన రహదారికి దూరంగా ఉన్న భూములు కూడా కొనుగోలు చేసి వెంచర్లు వేసేవారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద క్రయవిక్రయదారులతో సందడిగా ఉండేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా మందగించింది. నాలుగైదు నెలల క్రితం మెదక్ ప్రాంతంలో విక్రయాలు, కొనుగోళ్లకు సంబంధించి రోజుకు 20 వరకు రిజిస్ట్రేషన్లు ఉండగా, ప్రస్తుతం 5కు మించడంలేదు. ఇవి కూడా కుటుంబ సభ్యుల మధ్య పంపకాలు, గిఫ్ట్ డీడ్లే.