జేఈఈ మెయిన్లో కటాఫ్ మారులు పొంది ఉత్తీర్ణత సాధించిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఐఐటీ మద్రాస్కు అప్పగించారు. ఈ నెల 27 నుంచి మే 7 వరకు అడ్వాన్స్డ్ దరఖాస్తులు స్వీకరిస్తారు.
మే 26 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ -1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ -2కు పరీక్షలు జరుగుతాయి. వీటి ఫలితాలను జూన్ 9న ప్రకటిస్తారు. ఆ తర్వాత నుంచి జోసా రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది.