ఎడ్జ్బాస్టన్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా వైరస్ సంక్రమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్లో ఉన్న రోహిత్.. లీస్టర్తో ప్రాక్టీసు మ్యాచ్ ఆడుతున్న సమయంలో వైరస్ బారిన పడ్డాడు. అయితే రోహిత్ ప్రస్తుతం క్వారెంటైన్లో ఉన్నారు. ఇక జూలై ఒకటో తేదీన ఇంగ్లండ్తో జరగనున్న అయిదో టెస్టు కోసం రోహిత్ స్థానంలో మయాంక్ అగర్వాల్ను ఎంపిక చేశారు. వాస్తవానికి ఈ టెస్టు కోసం కేఎల్ రాహుల్ కూడా దూరంగా ఉన్నాడు. సౌతాఫ్రికాతో సిరీస్కు ముందు రాహుల్ గాయపడడంతో అతను దూరం అయ్యాడు. ఇప్పుడు రోహిత్కు కరోనా సోకడం వల్ల .. ప్రత్యామ్నాయంగా మయాంక్ అగర్వాల్కు ఇంగ్లండ్కు పంపారు. ఒకవేళ రోహిత్ కోలుకోకుంటే అతని స్థానంలో మయాంక్ ఆడే అవకాశాలు ఉన్నాయి.