హైదరాబాద్ : రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సమక్షంలో మార్వాడి సమాజ్ నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బంజారాహిల్స్లో జరిగిన కార్యక్రమంలో మార్వాడి సమాజ్ నేత హర్ష్ పటేల్తో పాటు 50 మందికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రజల పార్టీ అని, అన్ని వర్గాల అభివృద్ధిపై ఒకే రకమైన వైఖరిని అవలంభిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ తన ఏడేళ్ల పాలనలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమం కోసం టీఆర్ఎస్ పని చేస్తుందని, కష్టపడి పని చేసే పార్టీ కార్యకర్తలకు గౌరవం లభిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్పై విశ్వాసం ఉందన్నారు. మార్వాడి సమాజ్ అధ్యక్షుడు హర్ష్ పటేల్, బాబులాల్, రాజేశ్తో పాటు 50 మంది టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత ఆజం అలీ, బద్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.