హైదరాబాద్ : ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం (వరల్డ్ హెరిటేజ్ సైట్)గా యునెస్కో గుర్తింపు దక్కడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు కోసం సహకరించిన కేంద్రానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత్కు మద్దతు తెలిపిన యునెస్కో సభ్య దేశాలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయానికి గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించారు. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా ఆలయాలు నిర్మించారు. కాకతీయ శిల్పకళా నైపుణ్యం దేశంలోనే ప్రత్యేకమైంది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి పూర్వ వైభవానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించడం పట్ల మంత్రి కేటీఆర్ సైతం ఆనందం వ్యక్తం చేశారు.
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు
రామప్పకు యునెస్కో గుర్తింపు..తెలంగాణకు గర్వకారణం
రామప్పకు యునెస్కో గుర్తింపు లభించడం హర్షణీయం