టీమిండియా సారధి రోహిత్ శర్మ రికార్డును కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ (3487 రన్స్)ను గప్తిల్ దాటేశాడు. వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో 15 పరుగులు చేసిన గప్తిల్.. మొత్తంగా టీ20 క్రికెట్లో 3497 పరుగులతో రోహిత్ రికార్డును బద్దలు కొట్టాడు.
ప్రస్తుతం గప్తిల్, రోహిత్ తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ సారధి విరాట్ కోహ్లీ (3308 రన్స్) ఉన్నాడు. త్వరలోనే ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ర్యాంకుల్లో మళ్లీ మార్పులు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Martin Guptill – leading runs scorer in Men's T20Is 🏏 pic.twitter.com/edGyaYRH7q
— Doordarshan Sports (@ddsportschannel) August 15, 2022