హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకంపై( Free bus scheme) సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. వెనుకా ముందు చూసుకోకుండా తీసుకొచ్చిన ఈ పథతో ఎంతోమంది ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డున పడ్డాయి. ఉపాధిలేక మరెందరో ఆత్మహత్య చేసుకున్నారు. ఉచిత ప్రయాణం వల్ల పోనీ మహిళలు సంతోషంగా ఉన్నారంటే అదీ లేదు. సీట్ల కోసం ఆడబిడ్డలు(Women) జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. బస్సు ఎక్కడానికే.. డ్రైవర్ సీట్లలో నుంచి పోతున్నరు. కిటీకీల నుంచి దుంకుతున్నరు.
చాలినన్నీ బస్సులు(TSRTC)లేక, ఉన్నవి సరిగా రాక ఉచిత ప్రయాణం అనేసరికి ఆర్టీస సిబ్బంది చిన్న చూపు చూడటం వంటి అనేక సమస్యలతో మహిళలు విలవిల్లాడుతున్నారు. రోజు రోజుకు ఫ్రీ బస్సు వద్దనే వారి సంఖ్య పెరుగుతున్నది. అందులో మహిళలే ముందుండి ఈ ఉచిత ప్రయాణం మాకొద్దు అని చెప్పడం విశేషం. తాజాగా సూర్యాపేట జిల్లాలో కొంతమంది మహిళలు ఫ్రీ బస్సు వద్దని నినదించారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సతీమణి సునీత సూర్యాపేటలో (Suryapet) ప్రచారం నిర్వహిస్తుండగా కొంత మంది మహిళలు తనని కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఫ్రీ బస్సు వల్ల తమ కాళ్లు, చేతులు విరుగుతున్నాయని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కేసీఆర్ ఉన్నపుడే మా పెన్షన్ టైంకి వచ్చేది. మా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్కే ఓటేస్తామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఫ్రీ బస్సు పథకంపై పునరాలోచన చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
మాకు ఫ్రీ బస్సు వద్దు
ఈ ఫ్రీ బస్సుతో ముసలోళ్ల కాళ్లు చేతులు ఇరుగుతున్నాయి..
కేసీఆర్ ఉన్నపుడే మా పెన్షన్ టైంకి వచ్చేది.. మా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్కే ఓటేస్తాం.
సూర్యాపేట ప్రచారంలో భాగంగా వెళ్లిన సునీత జగదీష్ రెడ్డితో ఈ ప్రభుత్వంలో బాధలు పడుతున్నామని వృద్ధుల ఆవేదన. pic.twitter.com/RkavpQOf8a
— Telugu Scribe (@TeluguScribe) May 6, 2024