తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంలో కేసీఆర్ పోరాటం ప్రపంచానికంతా తెలిసిందే. అంతటి త్యాగంతో కూడిన పోరాట చరిత్ర ఆయనది. ఉద్యమంలోనైనా స్వరాష్ట్రంలోనైనా నాటి నుంచి నేటి వరకూ ఉద్యమ నేత కేసీఆర్ ముందుచూపు చాలా గొప్పది. ఆయనలో ఉన్న ఆ కోణమే నేడు ఆయనను తెలంగాణ రాష్ర్టాభివృద్ధిని పరుగులు పెట్టించేలా చేయడంతో పాటు ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు చేరేలా చేసింది. సీఎం కేసీఆర్ ఏమైనా చెప్పిండంటే అందు లో ఖచ్చితంగా శాస్త్రీయ కోణంతో పాటు మానవీయ కోణం ఉంటుంది. ఇది అనేక సందర్భాలలో స్పష్టమైంది.
వాస్తవానికి కేసీఆర్ ఇచ్చినంత గుండెధైర్యం తెలంగాణ ప్రజలకు మరెవరూ ఇవ్వరు. ఎందుకంటే ఆయన మాట్లాడుతుంటేనే తెలంగాణ ప్రజల్లో ఓ ధైర్యం, ఉత్సాహం నిండుకుంటాయి. తెలంగాణ మలి విడత ఉద్యమం ఆరంభం నుంచి రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆయన చేసిన సంక్షేమ పథకాలు కోట్ల ప్రజలకు పెద్ద దిక్కుగా నిలిచాయి.
ఉద్యమ సమయంలో అనేకమంది విద్యార్థులు ప్రాణత్యాగాలకు పాల్పడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ కుటుంబాలను ఆదుకుంటా మని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రకటించారు. మాట ఇచ్చినట్టే తెలంగాణ రాగానే ఆయా కుటుంబాలకు పదిలక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. పోలీస్ కిష్టయ్య కుటుంబానికి అన్నీ తానై నిలిచిన కేసీఆర్ ఆయన భార్యకు ఉద్యోగ అవకాశం కల్పించడంతో పాటు వారి పిల్లల చదువులకు తోడ్పాటునందించారు. వారు ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సాహం కల్పించారు.
ఉద్యమంలో భాగస్వాములైన సామాన్య కార్యకర్తలను సైతం గుర్తించి గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. తద్వారా ఎందరో ఉద్యమ బిడ్డలు కార్పొరేటర్లు, చైర్మన్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యే అవకాశం కలిగింది.
తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలకు, రైతులకు బీమా సౌకర్యం కల్పించారు. అదే కాకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అతి సామాన్య వ్యక్తులకు రాజకీయ అవకాశాలు కల్పించి సముచిత స్థానం కల్పించారు. అటువంటి ప్రయోగం వాస్తవానికి ఇప్పటికీ ఏ రాజకీయ పార్టీ ధైర్యం చేయలేదు. విద్యార్థి నాయకులుగా పని చేసిన బాల్క సుమన్, గువ్వల బాలరాజు, గాదరి కిషోర్ తదితరులతో పాటు అనేక మందికి ఎమ్మెల్యే, ఎంపీలుగా అవకాశాలు ఇచ్చారు. అలాగే ఎర్రోళ్ల శ్రీను, మన్నె క్రిషాంక్, మేడే రాజీవ్ సాగర్ లాంటి విద్యార్థి నాయకులను ప్రభుత్వంలో భాగస్వాములను చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. మరోవైపు తనను నమ్మిన వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడంలో కేసీఆర్ను మించిన శక్తి తెలంగాణలో మరొటి లేదు.
తన గళంతో ఈ తెలంగాణ గడ్డమీద నిత్యం చైతన్యానికి పాటుపడిన గాయకుడు సాయిచంద్ మృతి చెందిన విషయం తెలిసిందే. గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి అకాల మరణం చెందడంతో తిరిగి ఆయన సేవలకు గుర్తుగా సాయిచంద్ భార్య రజనీకి అదే కార్పొరేషన్ పదవిని ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ తరపున రూ. కోటిన్నర ఆర్థిక సాయం చేసి.. వారికి పెద్ద దిక్కుగా నిలిచారు. అదే సమయంలో ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ జగదీష్ అకాల మరణం చెందడంతో వారి కుటుంబానికి పార్టీ కొండంత అండగా నిలిచింది.
ఇటీవలనే వారి కుటుంబ సభ్యులకు సైతం కోటిన్నర ఆర్థిక సాయం అందించి వారికి ఆప్తునిగా నిలిచారంటే.. ఉద్యమ నాయకుడు ప్రజల పట్ల ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తున్నారనేది మనం గమనించవచ్చు. అలాగే గతంలో చైనా సరిహద్దులో జరిగిన ఆర్మీ ఘర్షణల్లో కల్నల్ సంతోష్బాబు అమరుడయ్యాడు. ఆ సమయంలో కేసీఆర్ వారి కుటుంబానికి కొండంత ధైర్యం నింపారు. స్వయంగా కేసీఆర్ వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అండగా నిలవడమే కాకుండా రూ.5 కోట్ల ఆర్థిక సాయంతో పాటు భార్యకు గ్రూపు -1 క్యాడర్లో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కల్పించి గౌరవించారు. అంతటి ధైర్యం ఇచ్చే నాయకుడు వాస్తవానికి ఈ తెలంగాణలో ఎవరూ లేరు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యాసంస్థలలో తెచ్చిన గుణాత్మక మార్పుల వల్ల తెలంగాణ బిడ్డలు నీట్, తదితర జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తుంటే…ఎంతో మందికి ఆర్థిక భరోసా ఇచ్చారు. ఇటీవల రచన అనే అనాథ అమ్మాయి ఉన్నత చదువులకు దూరం అవుతున్న సందర్భంలో ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమెకు పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ కృతజ్ఞతతో తన సంపాదనలో రూ.లక్ష ప్రభుత్వానికే అందజేసిందంటే… కేసీఆర్ ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ఎంత ధైర్యం ఇస్తుందనే విషయాన్ని మనం గుర్తించాలి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పార్టీ అభ్యర్థులను ఖ రారు చేశారు. ములుగు నియోజకవర్గ అభ్యర్థిగా బడే నాగజ్యోతి పే రును ఖరారు చేయడం నిజంగా గొప్ప నిర్ణయం. గతంలోనే జెడ్పీటీసీ గా గెలిచిన ఆమెకు జడ్పీ వైస్ చైర్మన్గా అవకాశం కలిపించారు. ఇప్పుడు పార్టీకి ఆమె చేసిన సేవలకు ఉద్యమ నేత పెద్ద మనసుతో నాగజ్యోతికి ఎమ్మెల్యే టికెట్ ఖరారు చే యడమంటే ఆయన గొప్ప మనసు ను అర్థం చేసుకోవాలి. ఆమెను అ భ్యర్థిగా బరిలో ఉంచడం అంటే ఉ ద్యమ నేత ఆలోచన, మానవీయ కో ణాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే కేసీఆర్ అంటేనే ఒక నమ్మ కం. ఆయనే తెలంగాణకు శ్రీరామరక్ష.
(వ్యాసకర్త : విద్యార్థి నాయకుడు)