కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో దేశం మరో మైలు రాయిని చేరుకుంది. 85 శాతం అర్హులైన ప్రజలు మొదటి డోసును తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీంతో దేశ ప్రజలకు అందించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 127.93 కోట్లకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. ”మరో రోజు… మరో మైలు రాయిని చేరుకున్నాం. 85 శాతం అర్హులైన ప్రజలు మొదటి డోసును తీసుకున్నారు. ప్రధాని మోదీ మంత్రం ”సబ్ కా ప్రయాస్” అన్న నినాదంతో కోవిడ్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం” అని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య ట్వీట్ చేశారు.