సంగారెడ్డి : వర్షం వస్తుందని నువ్వులు తడిసి పోకుండా ప్లాస్టిక్ కవర్ కప్పేందుకు వెళ్లిన దంపతులపై పిడుగు పడి భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ విషాకర సంఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం అలీఖాన్ పల్లిలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కాట్రోత్ జగన్ (40) భార్య కాట్రోత్ మారోని (39) దంపతులిద్దరు వర్షం వస్తుందని నువ్వులు తడిసి పోకుండా కప్పడానికి చేను వద్దకు వెళ్లారు .ఈ క్రమంలో వారిపై పిడుగు పడటంతో జగన్ అక్కడికక్కెడే మృతిచెందగా భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో సంగారెడ్డి దవాఖానకు తరలించారు. జగన్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.