రామవరం, సెప్టెంబర్ 06 : కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియా కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ఎర్రగడ్డలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంతరబోయిన కామేశ్వరరావు (42) మహారాష్ట్రలోని చంద్రాపూర్ ప్రైవేట్ కంపెనీలో స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పని చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా కుటుంబ సమస్యలతో బాధపడుతూ, మనోవేదనకు గురవుతున్నట్టు సమాచారం. కుటుంబ సభ్యుల మధ్య తరచూ వాగ్వాదాలు జరిగేవి.
ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి గురై నేడు ఉదయం ఎర్రగడ్డలోని స్వగృహంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల కాలంలో టూ టౌన్ పోలీసులు దంపతులిద్దరికీ కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు టూ టౌన్ ఎస్ఐ బండారి కిశోర్ తెలిపారు. కామేశ్వరరావుకు ఓ కుమార్తె ఉంది.