మహబూబాబాద్ : మహబూబాబాద్(Mahabubabad) పార్లమెంట్ స్థానానికి భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) అభ్యర్థిగా మాలోతు కవిత (Malothu Kavitha) రెండు సెట్లతో తన నామినేషన్( Nomination) పత్రాలను రిటర్నింగ్ అధికారి అధ్వైత్ కుమార్ సింగ్కి అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే వచ్చే ప్రయోజనం ఏమి లేదన్నారు. బీఆర్ఎస్ గెలుపుతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. గతంలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.