చేర్యాల, ఫిబ్రవరి 6 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం 4వ వారం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది.
ఆదివారం కొమురవెల్లికి చేరుకున్న భక్తులు స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశ ఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు.
కాగా, సుమారు 25 వేల మంది భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి.
భక్తులు భారీగా తరలిరావడంతో మల్లన్న ఆలయ ఈవో ఏ.బాలాజీ, కమిటీ చైర్మన్ గీస భిక్షపతి, డైరెక్టర్లు, అర్చకులు, ఒగ్గు పూజారులు, సిబ్బంది సేవలు అందించారు.