తిరుమల : అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 5 నుంచి 9వ తేదీ వరకు జరుగనున్నాయి. జూన్ 9న ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు. 4న సాయంత్రం శోభాయాత్ర, రాత్రి 7 గంటలకు పుణ్యాహవచనం, ఆచార్య ఋత్విక్ వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
జూన్ 5న ఉదయం 8.30 గంటలకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, అకల్మషహోమం, అక్షిమోచనం, పంచగవ్యాధివాసం సాయంత్రం 6.30 గంటలకు అగ్నిప్రతిష్ట, కలశస్థాపన, కుంభావాహనం, కుంభారాధన, ఉక్త హోమాలు నిర్వహిస్తానమన్నారు. 6న కుంభారాధన, ఉక్త హోమాలు, నవ కలశ స్నపన క్షీరాధివాసం, సాయంత్రం హోమాలు, యాగశాల వైదిక కార్యక్రమాలు చేపడతారని వివరించారు.
7, 8,9 తేదీల్లో నుంచి పుణ్యాహవచనం, కుంభారాధన, చతుర్ధశ కలశ స్నపన జలాధివాసం, హోమాలు, యాగశాల కార్యక్రమాలు నిర్వహిస్తారని వెల్లడించారు. 9న ఉదయం ధ్వజారోహణం, భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని తెలిపారు.