యాదాద్రి, మార్చి 28 : ఉదయం 11.55 గంటలకు దివ్య విమానగోపురంపై ప్రతిష్ఠించిన మహా సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ సంప్రోక్షణ చేసి ఆలయాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి కుటుంబ సమేతంగా చాపర్పై బయల్దేరిన సీఎం కేసీఆర్ 9.20 గంటలకు యాదాద్రికి చేరుకొని ఏరియల్ సర్వే నిర్వహించారు.
యాదాద్రి దివ్యక్షేత్రాన్ని అద్భుతమైన రీతిలో పునఃనిర్మాణం చేసిన సీఎం కేసీఆర్ ధన్యుడు. ఇంత గొప్ప ఆలయ నిర్మాణ బాధ్యతలు తన భుజస్కందాలపై వేసుకొని పూర్తి చేసిన ఆయన అసమాన్యుడు. యాదాద్రి ఆలయ చరిత్రలో సీఎం కేసీఆర్ సార్ నిలిచిపోతారు. మహాకుంభ సంప్రోక్షణ పర్వాలు మహాద్భుతంగా ముగిశాయి. కనీవినీ ఎరుగని రీతిలో ఆలయ నిర్మాణం జరిగింది. తెలంగాణలో మరెక్కడాలేని విధంగా నిర్మాణాలు పూర్తయి స్వయంభువు నారసింహుడి దర్శనం భక్తులకు కలిగింది.
-ప్రభుత్వవిప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి