మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 28: పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. జిల్లాకేంద్రంలోని రామయ్యబౌలి పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా టీ హబ్ సేవలకు సంబంధించి రిజిస్టర్లను పరిశీలించారు. టీహబ్ సేవలు ఎలా ఉన్నాయని, ఓపీ సేవలపై డాక్టర్లు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ను తనిఖీ చేసి సిబ్బంది సమయానికి వస్తున్నారా.. అని తెలుసుకున్నారు. అనంతరం రోగులతో మాట్లాడారు. ఆరోగ్య కేంద్రం ఆవరణలో హరితహారం కింద మొక్కలు నాటించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట డాక్టర్ మహేశ్వ రి, వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ఏవో భాస్కర్ ఉన్నారు.
ట్యాంక్బండ్ పనులు వేగవంతం చేయాలి
మహబూబ్నగర్, జూన్ 28 : ట్యాంక్బండ్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మంగళవారం కలెక్టర్ ట్యాంక్బండ్ పనులను పరిశీలించారు. ఐలాండ్, బ్రిడ్జిలు, సీసీరోడ్డు, సస్పెషన్ బ్రిడ్జి తదితర పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. అన్ని బృందాలు ముమ్మరంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ చక్రధర్, మనోహర్, డీటీ రాజగోపాల్ పాల్గొన్నారు.
అర్హులందరికీ అక్రిడిటేషన్ కార్డులు
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. కలెక్టర్ చాంబర్లో మీడియా గుర్తింపు కమిటీ సమావేశంలో మాట్లాడారు. 239జీవో ప్రకారం అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో డీపీఆర్వో వెంకటేశ్వర్లు, మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
భూసేకరణ పూర్తిచేయాలి
ప్రజలకు మంచి చేయాలనే తపనతో చేపట్టిన భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లో భూసేకరణపై ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మనఊరు -మనబడి కింద ఆర్అండ్బీ ఇంజినీర్లు వెంటనే వారికి కేటాయించిన పనులను పరిశీలించి 29వ తేదీలోగా నివేదిక అందించాలని ఆదేశించారు. రైల్వే, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తదితర అంశాలపై సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఆర్డీవో అనిల్కుమార్, ప్రత్యేక కలెక్టర్ పద్మశ్రీ, ఇంజినీరింగ్ శాఖ అధికారులు, ఇంజినీర్లు, తాసిల్దార్లు పాల్గొన్నారు.
విద్యార్థులకు నోట్పుస్తకాలు పంపిణీ
విద్యార్థులు ప్రణాళికతో చదివి ఉన్నత చదువులు చదువాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. జిల్లాకేంద్రంలోని మాడల్ బేసిక్ హైస్కూల్లో భారత సేవా ఆశ్రమ సంఘం, రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సమకూర్చిన నోట్ పుస్తకాలను కలెక్టర్ అందజేసి మాట్లాడారు. సేవా ఆశ్రమ సంఘం వారు 14ఏండ్లుగా విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేయడం అభినందనీయమన్నారు. 50వేల నోట్ పుస్తకాలు అందజేశారని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భారతసేవా ఆశ్రమ సంఘం మునీశ్వర్, ఆనంద్, రెడ్క్రాస్ చైర్మన్ లయన్నటరాజ్, హెచ్ఎం ఎండీ జోహార్, ఎంఈవో జయశ్రీ, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.