మహబూబ్నగర్టౌన్/మహబూబ్నగర్/పాలమూరు, సెప్టెంబర్ 27: తెలంగాణ సమాజానికి చిరస్మరణీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన ఆశసాధనకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో వైస్చైర్మన్ తాటిగణేశ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, ఏఎంసీ శంకర్సింగ్, ఏసీపీ ప్రతాప్. మేనేజర్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీవైఎస్వో శ్రీనివాస్, సిబ్బంది విజయ్కుమార్, జయశ్రీ పాల్గొన్నారు. అలాగే కలెక్టరేట్లో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్ నందలాల్పవార్, అధికారులు బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఇరిగేషన్ కార్యాలయంలో ఎన్టీపీఏ హన్మంత్, డీఏవో వెంకటేశ్వర్లు, టీఎన్జీవోఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రానాయక్, సూపరింటెండెంట్ నరేందర్రెడ్డి, ఆరీఫ్ఆహ్మద్ఖాన్, నవీన్, గోవర్ధన్, శ్రీనివాస్రెడ్డి, అమరేశ్వర్, లావణ్య, కార్తీక్, ఉద్యోగులు నివాళులర్పించారు. పాలమూరు యూనివర్సిటీలో వీసీ లక్ష్మీకాంత్రాథోడ్, ప్రొఫెసర్ గిరిజా మంగతాయారు, రిజిస్ట్రార్ మధుసూదన్రెడ్డి, ప్రవీణ, అధ్యాపకులు నివాళులర్పించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి
మూసాపేట(అడ్డాకుల), సెప్టెంబర్ 27: మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీ పీ నాగార్జునరెడ్డి, జెడ్పీటీసీ రాజశేఖర్రెడ్డ్డి, ఎంపీడీవో మంజుల, వైస్ఎంపీపీ రాధిక, రైతుబంధు సమితి మం డల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు జయన్నగౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు తోకల శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు శ్రీకాంత్, భాస్కర్నాయుడు, తిరుపతయ్య, ఎంపీటీసీలు గణేశ్, చంద్రయ్య, శాంత మ్మ, రమేశ్గౌడ్, విజయ్కుమార్రెడ్డి, శ్రీధర్, ప్రతాప్రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, సెప్టెంబర్ 27: మండలంలోని అన్నారెడ్డిపల్లిలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. రైతుబంధు సమితి గ్రామ కోఆర్టినేటర్ సూర్యనాయక్, సర్పంచ్ బామినిబాయి బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి, పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు లోక్యానాయక్, లక్ష్మణ్, కిషన్ నాయక్, అంగన్వాడీ టీచర్ అనూష పాల్గొన్నారు.
దేవరకద్ర, చిన్నచింతకుంట మండలంలో..
దేవరకద్రరూరల్, సెప్టెంబర్ 27: దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ రమాదేవి ఆధ్వర్యంలో దేవరకద్ర మండల పరిషత్ కార్యాలయంలో, చిన్నచింతకుంట తాసిల్దార్ సువర్ణరాజు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీ నివాసులు, ఎంపీవో శ్రీనివాస్రావు, నాయకులు శ్రీకాం త్, శేఖర్రెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
భూత్పూర్, నవాబ్పేట మండలంలో..
భూత్పూర్/నవాబ్పేట, సెప్టెంబర్ 27: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని మంగళవారం భూత్పూర్ ఎంపీడీవో కార్యాలయంలో వైస్ఎంపీపీ నరేశ్గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీవో విజయ్కుమార్, సర్పంచ్ ఆంజనేయులు పాల్గొన్నారు. నవాబ్పేట మండల పరిషత్ వద్ద బాపూజీ చిత్రపటానికి నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ నర్సింహులు, ఎంపీడీవో శ్రీలత, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ముడా డైరెక్టర్ చెన్నయ్య, నాయకులు ప్రతాప్, గాండ్ల రవి, రుద్రారం సర్పంచ్ లలితమ్మ, రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ కృష్ణగౌడ్ పాల్గొన్నారు.
జడ్చర్ల మున్సిపాలిటీలో..
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 27: కొండా లక్ష్మణ్బాపూజీ జ యంతిని మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి చైర్పర్సన్ లక్ష్మి పూలమాలవేసి నివాళులర్పించారు. గాంధీచౌరస్తాలో నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో కమిషనర్ మహమూద్ షేక్, కౌన్సిలర్లు, బీసీసేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయాదవ్, శేఖర్, నిరంజన్ పాల్గొన్నారు.